వైసీపీ నేతలు విశాఖ వాసులను అవమానిస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. విశాఖ వాసులు.. వైకాపా నేతల మాదిరి ప్రవర్తించే క్రూరులు కాదన్నారు.శాంతికి నిదర్శనంగా నిలిచే విశాఖ ప్రజలను వైసీపీ నేతలు రౌడీలు, సంఘ విద్రోహులతో పోల్చుతున్నారన్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలే చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారని వైసీపీ అనుమానించడం పై ఆయన మండిపడ్డారు. విశాఖ ప్రజలను రౌడీయిజాన్ని ప్రేరేపిస్తూ విశాఖ అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందన్నారు. అల్లర్లను ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడులు రాకుండా చేస్తూ ఉపాధికి గండి కొడుతోందన్నారు. 27న జరిగిన సంఘటనతో జగన్ క్రూరత్వం బయటపడిందని ప్రతి పౌరుడు గ్రహించాలని యనమల పేర్కొన్నారు.