telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అన్ని ప్రాంతాల అభివృద్ధే వైసీపీ ధ్యేయం: మంత్రి బొత్స

minister bosta in vijayawada meeting

అన్ని ప్రాంతాల అభివృద్ధే వైసీపీ ధ్యేయమని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధానిపై కమిటీలు వేశామని ఆయన తెలిపారు. వాటి నివేదికల్లోని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రాజధాని ఎక్కడున్నా తమకు ఇబ్బందేమీలేదని బొత్స వ్యాఖ్యానించారు.

కానీ రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోవాలని అన్నారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం, అభివృద్ధి చేయడం జరిగే పని కాదని స్పష్టం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్దే సీఎం జగన్ లక్ష్యం అని ఉద్ఘాటించారు. అన్ని ప్రాంతాలను పైకి తీసుకురావడమే వైసీపీ ధ్యేయమని తెలిపారు.

Related posts