telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భూవివాదంలో టీడీపీ నేత సోమిరెడ్డిపై కేసు నమోదు

somireddy brother into ycp today

ఓ భూవివాదంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ వ్యవహారం పై సోమిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం రాగానే తనను టార్గెట్ చేసుకుంటారని ఊహించానని అన్నారు.

కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును దాచి, ఇప్పుడు అదే అంశంలో ప్రయివేటు కేసు పెట్టారని సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. కోట్ల విలువ చేసే నా భూములే అమ్ముకున్నాను తప్ప ఓ పల్లెటూళ్లోని 2.83 ఎకరాల స్థలం కోసం ఫోర్జరీకి పాల్పడే స్థాయికి దిగజారలేదని ఆయన వ్యాఖ్యానించారు. తనకు న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని, ఎవరిది తప్పో కోర్టులే తేలుస్తాయని అన్నారు.

Related posts