telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భూముల విక్రయాలపై..ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ap high court

ఏపీలో భూములను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ-వేలానికి సంబంధించి నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్తులు అమ్మడం ద్వారానే ప్రభుత్వాన్ని నడపడం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం చేయాలనుకుంటున్నారా? ప్రభుత్వం దివాళా తీసిందా? అని ప్రశ్నించింది.

ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో… ఇంత అర్జంటుగా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి తాము ఇచ్చే ఉత్తర్వులకు లోబడే వేలం నిర్వహించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. దీంతో, తదుపరి విచారణను మే 28వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Related posts