telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ హయాంలోనే బోటుకు అనుమతి: మంత్రి అవంతి

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే ఈ బోటు తిరిగేందుకు అనుమతి ఇచ్చారని చెప్పారు. బోటు నిర్వాహకుడు టీడీపీ మద్దతుదారుడు అని చెప్పారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పుష్కరాల సమయంలో వశిష్ట బోటులోనే ప్రయాణించారని గుర్తుచేశారు. బోటు ప్రమాద ఘటనలో బాధితకుటుంబాలకు నష్టపరిహారం ప్రభుత్వమే ఇస్తుందని స్పష్టం చేశారు. నాకు బోటు వ్యాపారాలు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారని అదంతా కేవల దుష్ప్రచారం మాత్రమేనని మండిపడ్డారు. బోటు బాధితులకు ప్రభుత్వమే నష్టపరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సైబర్ నేరగాళ్లతో బాధితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related posts