ఘట్ కేసర్ బీ-ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్థిని.. వెంటనే ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కండీషన్ క్రిటికల్ కావడంతో అక్కడి నుండి గాంధీ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. యువతికి గాంధీ ఆస్పత్రి వైద్యులు ట్రీట్ మెంట్ ఇచ్చి… సాయంత్రం ఇంటింకి పంపించారు. అయితే.. రాత్రి కుటుంబ సభ్యులు పడుకున్నాక మరొసారి షుగర్ మాత్రలు మింగింది విద్యార్థిని. ఆమె పరిస్థితి మరింత విషమించడంతో ఘట్ కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తెల్లవారుజామున తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. ఘట్ కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి 10.40 నిమిషాలకు ఆ విద్యార్థిని తీసుకు రాగా…10.55 నిమిషాలకు ఆమె మృతి చెందింది. తండ్రి షుగర్ కోసం వాడే ట్యాబ్లెట్లను మింగి సుసైడ్ చేసుకుంది విద్యార్థిని. కిడ్నాప్ ఘటన జరిగిన తరువాత ఘట్కేసర్లోని విద్యార్థిని అమ్మమ్మ ఇంటికి తీసుకువచ్చారు పేరెంట్స్. ఘటన జరిగినప్పటి నుంచి డిప్రెషన్ లో ఉన్న విద్యార్థిని…తాజాగా ఆత్మహత్యకు పాల్పడింది.
previous post
next post