telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ విధానాలకు కోర్టు తీర్పు శరాఘాతం లాంటిది: సోమిరెడ్డి

somireddy brother into ycp today

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలకు ఈ తీర్పు శరాఘాతం లాంటిదని అన్నారు.

ఇప్పటికైనా సీఎం జగన్ వాస్తవాలు పరిశీలించాలని హితవుపలికారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్షంపై కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని అన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడటం దారుణమని సోమిరెడ్డి దుయ్యబట్టారు. సీఎం జగన్ ధోరణితో రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని విమర్శించారు.

Related posts