టీమిండియా యాజమాన్యం అంతర్జాతీయ క్రికెట్లో రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్ బౌలర్కి నమ్మకం కలిగించలేదని మాజీ సారథి సునీల్ గావాస్కర్ అన్నారు. ఇటీవల కాలంలో భారత జట్టులో విజయవంతమైన బౌలర్ అశ్విన్ అని, అలాంటి ఆటగాడిని ఏడాదికిపైగా పక్కకు తప్పించడం సరికాదన్నారు. ఆస్ట్రేలియాలో ఒక్క మ్యాచ్లో విఫలమయ్యే సరికి అతడిని పక్కకు పెట్టారని, వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసినా తుది జట్టులో అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.
అశ్విన్ స్వేచ్ఛగా బౌలింగ్ చేయకపోవడం వల్లే కాస్త ఇబ్బంది పడుతున్నాడని చెప్పారు. అలాగే అతడి చుట్టూ ఉండే ఆటగాళ్లు నమ్మకం కలిగించాలని కోరారు. ఆసీస్తో ఆడేటప్పుడు నాథన్లాయన్తో పోల్చారని, అలాగే ఇంగ్లాండ్తో ఆడేటప్పుడు మోయిన్ అలీతో పోల్చారని అన్నారు. అతడిలాంటి ఆటగాడిని పక్కకు పెట్టడం సరికాదని గావస్కర్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో రెండో రోజు ఆఖర్లో అశ్విన్ రెండు వికెట్లు తీయగా మూడో రోజు కెప్టెన్ డుప్లెసిస్(55)ని సైతం ఔట్ చేశాడు.
ఆ విషయం అసంతృప్తి కలిగించింది : నీతి ఆయోగ్