ఏపీ రాధాని అంశంపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. నెల్లూరులో టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీలో సీఎం చెప్పిన విషయాలే జీఎన్ రావు, బీసీజీ కమిటీ నివేదికల్లో ఉన్నాయని విమర్శించారు.
ప్రధాని శంకుస్థాపన చేసి నిధులు కూడా ఇచ్చాక, ఇప్పుడు రాజధాని అమరవతిని మార్చుతుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను బాధపెట్టడం సరికాదని సోమిరెడ్డి హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని సోమిరెడ్డి హితవుపలికారు.
కేసీఆర్, కేటీఆర్ నిర్వహించిన శాఖలు చివరిస్థానంలో ఉన్నాయి: రేవంత్ రెడ్డి