telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తీర్పును అందరం హృదయపూర్వకంగా స్వీకరించాలి: చంద్రబాబు

chandrababu

ఉత్తరప్రదేశ్ అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు కాసేపట్లో వెల్లడించనుంది. ఈ కేసులో 40 రోజుల పాటు రోజువారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత నెల 16న తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సున్నితమైన ఈ కేసులో తీర్పు వెల్లడి కానున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.

అయోధ్య విషయమై తీర్పు వెలువడబోతున్న సందర్భంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలి. సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలి. శాంతి, సౌభ్రాతృత్వంతో సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Related posts