కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా చర్యలను చేపడుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలను అందించడమే కాకుండా నైతికంగా తమ మద్దతుని తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తెలుగు సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ డ్కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. అయితే ఇప్పటికే విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, అతని మాజీ భార్య సుసానే ఖాన్ను లాక్డౌన్ ఒక్కటి చేసింది. లాక్డౌన్ ప్రారంభ సమయంలోనే వీరిద్దరూ ఒకే ఇంటికి మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మళ్లీ కలవడంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా సుసానే స్పందించింది. “విడాకుల తర్వాత కూడా పిల్లల కోసం అప్పుడప్పుడు కలవాలని మేం మొదట్లోనే నిర్ణయించుకున్నాం. అనుకున్న ప్రకారమే చేశాం. లాక్డౌన్ సమయంలో ఒకే ఇంట్లో పిల్లలతో కలిసి ఉండాలని హృతిక్, నేను తీసుకున్న నిర్ణయం తెలివైనది, హృదయపూర్వకమైనది. ప్రేమపూర్వకంగా లాక్డౌన్ను కొనసాగించాలని మేం నిర్ణయించుకున్నాము” అని సుసానే చెప్పింది. హృతిక్, సుసానే ఖాన్ లు 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు జన్మించాక వీరిద్దరూ అభిప్రాయ బేధాలతో 2014లో విడాకులు తీసుకున్నా సెలవులు, విందులకు కలిసి వెళుతుండటం విశేషం.
previous post
next post