ఏ పార్టీకి మద్దతు ఇస్తామనేది ఫలితాల అనంతరమే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 12న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తామన్న పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా నేతృత్వంలోని మతతత్వ బీజేపీకి తప్ప మరే పార్టీకైనా కేంద్రంలో మద్దతు తెలుపుతామని తెలిపారు. ఢిల్లీ తూర్పు ఆప్ అభ్యర్థి ఆతిషిపై బీజేపీ నేతలు చేస్తున్న దుష్ర్పచారాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఉన్నత విద్యానభ్యసించిన ఓ మహిళ పట్ల బీజేపీ అలా ప్రవర్తించడం సరైనది కాదని అన్నారు.
ఈవీఎంలలో జరిగిన అవినీతి వల్ల.. వైసీపీ గెలిచే అవకాశాలే ఎక్కువ: కేఏ పాల్