telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

శ్రీశైలం జలాశయంలో పోటెత్తిన వరద!

srisailam is full capacity water released

గత వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోతేట్టింది. దీంతో కృష్ణా నది పై ఉన్న జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో పైనుంచి శ్రీశైలం డ్యామ్ కు వరద ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 4,29,522 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 2,70,423 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.

జలాశయం పూర్తి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.30 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు డ్యామ్ ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పాదన కొనసాగుతోంది.

Related posts