telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జమ్మూ కశ్మీర్‌ : .. స్వతంత్ర అభ్యర్థులే గెలిచారు.. 81స్థానాలలో బీజేపీ పోరాటం..

independents won in block development polls

రాష్ట్రంలో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు సత్తాచాటారు. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తరువాత అక్కడ జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో ఫలితాలపై అందరికి ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 217కు పైగా స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 81 బ్లాక్‌లను కైవసం చేసుకుంది. జమ్మూ రీజియన్‌లో మూడోవంతు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. కశ్మీర్‌ రీజియన్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, కాంగ్రెస్‌లు దూరంగా ఉన్నాయి.

కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకోకముందే.. ఆ పార్టీకి చెందిన ఓ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ బ్లాక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థే గెలుపొందారు. అలాగే జేకేఎన్‌పీపీ పార్టీ 8 భ్లాకుల్లో విజయం సాధించింది. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 316 బ్లాక్‌లు ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల 6 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. 310 బ్లాక్‌లకు ఎన్నికలు నోటిఫికేషన్‌ విడుదల కాగా, అందులో 27 బ్లాక్‌లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 283 బ్లాకులకు పోలింగ్‌ జరగింది. అందులో 280 బ్లాక్‌ల ఫలితాలను వెలువడగా.. మరో 3 బ్లాక్‌ల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 98.3 శాతం పోలింగ్‌ నమోదైంది.

రీజియన్‌ల వారీగా ఫలితాలు :
* కశ్మీర్‌ రీజియన్‌లోని 128 బ్లాక్‌లు.. బీజేపీ-18, స్వతంత్రులు-109, కాంగ్రెస్‌-1
* లదాఖ్‌ రీజియన్‌లో 31 బ్లాక్‌లు.. బీజేపీ -11, స్వతంత్రులు-20
* జమ్మూ రీజియన్‌లో 151 బ్లాక్‌లు.. బీజేపీ-52, జేకేఎన్‌పీపీ-8, స్వతంత్రులు-88, మూడు స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది.

Related posts