telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఆయుధాలు అమ్మడం.. వ్యాపారంగా భావించినంత కాలం .. ఉగ్రవాదఅంతం అసాధ్యం..

srilanka president on terrorism

శ్రీలంక ఈస్టర్ పండుగ సందర్భంగా ఉగ్రదాడులకు గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శక్తిమంతమైన దేశాలు ఆయుధాలను తయారుచేయడం నిలిపివేస్తే ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటే ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రపంచంలోని ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఆయుధాలను తయారుచేయడంలేదని, పలు దేశాలు తయారు చేస్తున్న ఆయుధాలనే ఆ ఉగ్రవాద సంస్థలు ఉపయోగిస్తున్నాయని అన్నారు.

సాంకేతికంగా ముందంజలో ఉన్న దేశాలే శాంతి గురించి, మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాయని, కానీ అదే సమయంలో ఆ దేశాల సాంకేతిక పరిజ్ఞానమే మానవాళి వినాశనానికి కారణమవుతోందని వ్యాఖ్యానించారు.

Related posts