వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన బిజీ బిజీ గా కొనసాగుతుంది. ప్రధాని మోదీతో భేటీ అననతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూఅమిత్ షాపై జగన్ ప్రశంసలు కురిపించారు. ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తులను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించామని తెలిపారు. ప్రధాని తర్వాత దేశంలో అత్యంత పవర్ ఫుల్ నేత అమిత షాను కలిశానని చెప్పారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సహకరించాలని షాను కోరానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్టు జగన్ చెప్పారు. ‘నవరత్నాలు’ఎలా అమలు చేస్తారని విలేకరుల అడిగిన ప్రశ్నకు కేంద్ర సాయం కోరింది అందుకేనని జగన్ ఆసక్తికర సమాధానం చెప్పారు.