telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని స్మరించుకోవాలి: మంత్రి వెల్లంపల్లి

srinivasa rao minister

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.

అనంతరం వెలంపల్లి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణ త్యాగాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.  పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగానికి గుర్తుగా మార్చి 16న జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సీఎం జగన్ కి తన తరఫున, వైశ్య సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు తెలిపారు.

పొట్టి శ్రీరాములుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. ఆయన ప్రాణత్యాగం తర్వాత 1953 అక్టోబరు 1న ఒక రాష్ట్రంగా ఏర్పడిందని.. కానీ, భాషాప్రయుక్త రాష్ట్రంగా(ఆంధ్రప్రదేశ్) మాత్రం 1956 నవంబరు 1న అవతరించిందని తెలిపారు.

Related posts