ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహం చెన్నైలోని కోడంబాక్కంలో ఆయన నివాసం వద్దకు చేరుకుంది. ఎంజీఎం ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఆయన భౌతికకాయాన్ని తరలించారు. అప్పటికే ఆయన ఇంటి వద్దకు వందలాది మంది చేరుకున్నారు.
కరోనా భయాలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన గాయకుడిని చివరి సారి చూసుకోవాలని పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుంటున్నారు. మరోవైపు బాలు అంత్యక్రియలు రేపు చెన్నై సమీపంలోని తామరైపాకంలో ఉన్న ఆయన ఫాంహౌస్ లో జరగనున్నాయి.