telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరో సంచలన నిజాన్ని బయటపెట్టిన .. షుజా

shuju truth reveal on bjp scam in 2014

2014 ఎన్నికలలో ఈవీఎం హ్యాకింగ్ జరిగినట్టు వార్తలు భగ్గుమంటున్నాయి. షుజా సయ్యద్ అనేక నిజాలను బయటపెడుతున్నారు. తాజాగా మరోసంచలన విషయాన్నీ వెల్లడించారు. అప్పటి బీజేపీ నేత కిషన్ రెడ్డి బావమరిది కాకిరెడ్డి ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ గెస్ట్ హౌస్ లో కాల్పులు, 11 మందిపై జరుగగా, నేను మాత్రమే తప్పించుకున్నాను అంటున్నారు షుజా.

ఈ కేసుపై విన్ సొల్యూషన్స్ ద్వారా ఈ.సి.ఐ.ఎల్ కు టెక్నికల్ సహకారం అందించినట్టు తెలిపారు షుజా. ఆ సంస్థను దర్యాప్తు చేస్తే అంతా బట్టబయలు అవుతుందని అంటున్నారు. కాల్పుల నుండి తప్పించుకున్న తాను అమెరికా వెళ్లినట్టు షుజా తెలిపారు. అమెరికాలో నన్ను మనీష్ సిసోడియా, అర్ణబ్ గోస్వామి, వంశీరెడ్డి కలిశారు. ఈ.సి.ఐ.ఎల్ లో పనిచేస్తున్న సమయంలో వంశీరెడ్డి కలిశారని సయ్యద్ షుజా తెలిపారు. వివిప్యాట్ లో బగ్ ఫీట్ చేయమని నన్ను వంశీరెడ్డి అడిగినట్టు షుజా తెలిపారు. అనంతరం వంశీరెడ్డిని బస్సు ప్రమాదం పేరుతో చంపేశారు.

జే.ఎన్.టి.యూ లో ఆర్.ఎఫ్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టు తెలిపారు షుజా. షాదాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ చేశానని వారు తెలిపారు. కాగా, ఈ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి, ఖండించారు.

Related posts