ఒక చిత్రం ఏ భాషలో విజయం సాధించిన దానిని మిగిలిన బాషలలో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాగే ఇటీవల టాలీవుడ్ లో భారీ విజయం అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ వివిధ బాషలలో అప్పుడే విడుదల చేయడం జరిగింది. అలాగే తమిళ్ లో కూడా విక్రమ్ తనయుడు ‘ధృవ్’ హీరోగా .. బాల దర్శకత్వంలో ఈ సినిమాను ‘వర్మ’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో ధృవ్ జోడీగా మేఘ చౌదరి కథానాయికగా నటించింది.
అంతా షూట్ చేశాక, నిర్మాతలైన ‘ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్’ వారు ఈ సినిమా అవుట్ పుట్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారట. దానితో ఈ సినిమాను విడుదల చేయకూడదనే నిర్ణయానికి వచ్చేశారు. ఒక్క ధృవ్ ను మినహా మిగతా వాళ్లందరినీ ఈ ప్రాజెక్టు నుంచి తొలగించారు. మరో దర్శకుడితో మళ్లీ ఫ్రెష్ గా ఈ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒక వైపున దర్శకుల పేర్లను పరిశీలిస్తూనే, మరో వైపున హీరోయిన్ గా బాలీవుడ్ భామ ‘బణిత సంధు’ను ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే కొత్త టీమ్ సెట్స్ పైకి వెళ్లనుందట.