డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 18న సినిమా విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా వరంగల్లో బోనాలు అనే కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా ఎనర్జిటిక్ హీరో రామ్ మాట్లాడుతూ “ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. బోనాలు పండుగకి వరంగల్ రావడం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం… అదే సమయంలో మన సినిమాలో కూడా బోనాలు పాట ఉండటం ఆనందంగా ఉంది. మణిశర్మగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సాధారణంగా సినిమాలో ఒకటో, రెండో సాంగ్స్ బాగుంటాయి. కానీ సినిమాలో ప్రతిసాంగ్ బాగుంది. తెలంగాణ క్యారెక్టర్ చేయడం అంత సులభం కాదు. నభా నటేశ్ చాలా బాగా చేసింది. వరంగల్ కాలేజ్ కుర్రాళ్ల మీద కూడా ఓ కౌంటరేసింది. నిధి అగర్వాల్ సోఫెస్టికేటెడ్ సైంటిస్ట్ పాత్రలో నటించింది. ఇక ‘ఉండిపో’ సాంగ్లో తన విశ్వరూపం చూస్తారు. బోనాలు సాంగ్ను శిరీష్ కంపోజ్ చేశాడు. అలాగే కథతో పాటు మూవ్ అయ్యే ఫైట్స్ 8 ఉన్నాయి. వాటిని సతీష్ కంపోజ్ చేశాడు. రాజ్తోటగారు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. ఛార్మిసినిమా వ్యవహారాలను పర్యవేక్షించింది. దీంతో పనిపైనే కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుందనిపించేలా తను అందరినీ చూసుకుంది.
ఇక పూరిగారి గురించి చెప్పాలంటే.. ఏ సినిమా చేయాలో ఆలోచించుకుంటూ నేను విదేశాలకు వెళ్లిపోయాను. డ్యాన్సులు, ఫైట్స్, లుక్స్ సహా అన్ని ఉండి కొత్తగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారని తెలిసింది. ఆ సమయంలో పూరిగారిని కలిసినప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ ఐడియా వచ్చింది. బేసిక్ పాయింటే కొత్తగా ఉంటుంది. ఫస్ట్ టైమ్ సైఫై మాస్ ఎంటర్టైనర్తో వస్తున్నాం. చాలా ఎగ్జయిటెడ్గా ఉన్నాను. పూరిగారితో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను.. ‘మీతో పనిచేస్తున్నప్పుడు ఉన్న కిక్కే వేరండి’. చివరిరోజు షూటింగ్కు వెళితే పూర్తయిపోతుంది. వెళ్లాలా వద్దా? అని ఆలోచించుకుంటూ వెళ్లాను. అంతలా కనెక్ట్ అయ్యాను. జూలై 18న అందరూ సినిమా చూడండి” అన్నారు.