telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంజనా, రాగిణిలకు హైకోర్టులో మళ్ళీ చుక్కెదురు

Sanjana

శాండిల్‌వుడ్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న కన్నడ నటీమణులు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదీలకు కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. రాగిణి, సంజన ఇప్పటికే బెయిల్ కోసం పిటిషన్ వేయగా ప్రత్యేక కోర్టు అందుకు నిరాకరించింది. ఇప్పుడు మరోసారి వీరి బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సంజన, రాగిణి అక్టోబర్‌లో రెండోసారి బెయిల్ పిటిషన్ వేయగా.. అది మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. వీరి పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. కాగా, రాగిణిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోగా.. సెప్టెంబర్ 14 నుంచి ఆమె జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక సంజన సెప్టెంబర్ 16 నుంచి జుడిషయల్ కస్టడీలో ఉన్నారు. డ్రగ్ కేసులో రాగిణి, సంజనతో పాటు మరో 12 మంది అరెస్టయ్యారు. వీరితో పాటు మిగిలిన నిందితులంతా గతంలో స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. వీరంతా గత నెలన్నర రోజులుగా జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సెప్టెంబర్ 28న ఈ పిటిషన్‌లు విచారణకు రాగా కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున బెయిల్ మంజూరు చేయడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Related posts