telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పేదలకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Jaggareddy gives clarity party change

పేదలకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈరోజు జగ్గారెడ్డి పుట్టినరోజును అభిమానులు, కార్యకర్తల మధ్య తన ఘనంగా నిర్వహించుకున్నారు. అభిమానులు తీసుకొచ్చిన కేక్ ను జగ్గారెడ్డి కట్ చేశారు. జగ్గారెడ్డికి పూలమాలలు వేసిన ఆయన అభిమానులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుండిపోతారని అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 104, 108 సేవలను, ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని కొనియాడారు.వైఎస్ ఏ ప్రాంతానికి చెందినవారన్నది ముఖ్యం కాదని, పేదలకు మేలు చేశారా అన్నదే ముఖ్యమని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Related posts