telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జగన్ తో చిరు భేటీ… “151తో 151” అంటూ వర్మ ట్వీట్

chiranjeevi family

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి విజయవాడకి చేరుకున్న చిరంజీవి, ఆయన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి వెళ్లారు. మర్యాదపూర్వకంగా తనను కలిసిన చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్, భార్య భారతి చిరంజీవి దంపతులను ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా జగన్ చిరంజీవి “సైరా” సినిమా గురించి చర్చించారని అనుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ భేటీపై ఆసక్తికర చర్చ కొనసాగింది. చిరంజీవి జగన్ ఇంటికి చేరుకోగానే సీఎంకు షాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జగన్ సతీమణి భారతికి చీర అందించారు. మరోవైపు జగన్ కూడా చిరంజీవికి వీణను బహుమతిగా ఇచ్చారు. గంట పాటు చిరంజీవి, జగన్ బేటీ జరిగింది. సైరా సినిమా చూసేందుకు జగన్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ భేటీ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. సోషల్ మీడియాలో కూడా ఈ టాపిక్కే ట్రెండింగ్‌లో నిలిచింది. పలు వాయిదాలు పడిన ఈ కార్యక్రమం ఎట్టకేలకు సోమవారం పూర్తయింది. సోమవారం మధ్యాహ్నం చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. చిరు దంపతులను సాదరంగా ఆహ్వానించిన జగన్.. వారితో కలిసి లంచ్ కూడా చేశారు. ఈ భేటీపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. “వావ్.. 151తో 151” అంటూ ట్వీట్ చేశారు. 151 ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్‌తో 151 సినిమాలు చేసిన చిరంజీవి కలయిక అని అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ చేశారు.

Related posts