ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా “రంగమార్తాండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్గా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. విశాఖపట్నంలో చిత్ర షూటింగ్ జరుపుకుంటుండగా… చిత్ర షూటింగ్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్కి సిద్ధం చేయాలని కృష్ణవంశీ భావిస్తున్నారట. చిత్రంలో బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతోంది ఈ చిత్రం. సుమారు 15 ఏళ్ల తరువాత భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో పనిచేస్తుంది రమ్యకృష్ణ. 2004లో కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన శ్రీఆంజనేయంలో కీలకపాత్రలో నటించిన రమ్యక్రిష్ణ 15 ఏళ్ల తరువాత భర్త డైరెక్షన్లో హీరోయిన్గా చేయడం విశేషం. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘అంత:పురం’ సినిమా రాగా, ఈ సినిమా మ్యూజికల్ హిట్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం సిక్స్ ప్యాక్ బాడీతో నాగార్జునతోనే బిగ్ బాస్ సీజన్ 3 గ్రీకువీరుడు అనిపించుకున్న కంటెస్టెంట్ అలీ రెజా బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ణవంశీ అప్ కమింగ్ మూవీ ‘రంగమార్తాండ’లో కీలకపాత్రలో కనిపంచబోతున్నాడు అలీ రెజా. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్కి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు అలీ రెజా.
next post