చాలా హీరోలు సమాజ సేవలో చేయడంలో ముందుంటున్నారు. కరోనా టైమ్లో సోనూసూద్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు సహాయం చేయడం చూశాం. అదే బాటలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో యువ నటుడు నిఖిల్ కొన్ని దాతృత్వ కార్యకలాపాలు నిర్వహించారు. ఆయన కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, అవసరమైన వారికి ఇతర వైద్య పరికరాలను, సదుపాయాలను ఏర్పాటు చేశాడు.
ఈ నేపథ్యంలోనే నిఖిల్కు హైదరాబాద్ కమిషనర్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్ కష్ట కాలంలో బాధితులను ఆదుకోవడానికి తనవంతుగా నిఖిల్ చేసిన ప్రయత్నాలను గుర్తించి సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి సజ్జనార్ సత్కరించారు. అనంతరం సజ్జనార్ నిఖిల్తో సరదాగా సంభాషించారు.
సెకండ్ వేవ్ సమయంలో చేసిన పనులు, ఫ్రంట్ లైన్ కొవిడ్ పోలీస్ వారియర్లను కలవడం వంటి పనులకు గుర్తింపుగా సజ్జనార్ సార్ సత్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని నిఖిల్ పేర్కొన్నాడు. నిఖిల్ ను సజ్జనార్ సత్కరిస్తున్న ఫోటోలు సోషల్ మిడిల్ హల్చల్ చేస్తున్నాయి. కరోనా సమయంలో తనవంతుగా కష్టంలో ఉన్న చాలా మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు నిఖిల్.
ప్రస్తుతం నిఖిల్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న “కార్తికేయ 2” సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అంతకుముందు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ “కార్తికేయ” చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందుతోంది. మరోవైపు ఆయన నటిస్తున్న “18 పేజెస్” సినిమా చిత్రీకరణను పూర్తి చేసి డబ్బింగ్ పనులు ప్రారంభించాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తోంది.
ఇద్దరి మంచి కోసమే విడిపోయాం – విడాకులపై చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు