రోజురోజుకు బీజేపీలో చేరుతున్న సెలెబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, ఆ పార్టీలో మరో సెలెబ్రిటీ చేరారు. పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు దలేర్ మెహంది బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి సమక్షంలో పార్టీ కండువాను దలేర్ మెహంది కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు దలేర్ కు అభినందనలు తెలిపారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని అన్నారు.
ఢిల్లీ వాయవ్య బీజేపీ అభ్యర్థి, ప్రముఖ గాయకుడు హన్స్ రాజ్ హన్స్ తరపున ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. దలేర్ కు హన్స్ కు మధ్య బంధుత్వం ఉంది. హన్స్ కుమారుడితో దలేర్ మెహంది కుమార్తె వివాహం జరిగింది. బీజేపీలో దలేర్ మెహంది చేరిన సమయంలో ఆయన వెంట హన్స్ కూడా ఉన్నారు.
తెలంగాణలో కల్వకుంట్ల పోలీస్ సర్వీస్: ఎంపీ ఉత్తమ్