telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కీర్తి సురేష్ తాజా లుక్ పై వర్మ కామెంట్స్

Ram-Gopal-Varma

గ‌త ఏడాది ఇటు తెలుగు, అటు త‌మిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌తో అల‌రించిన కీర్తి సురేష్ ఈ ఏడాది ఒక్క సినిమాతోను ప‌ల‌క‌రించ‌లేదు. కాకపోతే ఆమె న‌టిస్తున్న ప‌లు ప్రాజెక్టులు మాత్రం సెట్స్‌పై ఉన్నాయి. అయితే ఇటీవ‌ల విడుద‌లైన మ‌న్మ‌థుడు 2 చిత్రంలో గెస్ట్ రోల్‌తోనే సరిపెట్టుకుంది. దీంతో పాటు హిందీ, త‌మిళంలోను సినిమాలు చేస్తుంది కీర్తి సురేష్‌. నరేంద్రనాధ్ దర్శకుడిగా రూపొందుతున్న‌ “మిస్ ఇండియా” అనే ఫీమేల్ సెంట్రిక్ చిత్రంలో న‌టిస్తున్న కీర్తి హిందీ, త‌మిళ భాష‌ల‌లోను ప‌లు సినిమాలు చేస్తుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండ‌గా, దిల్‌రాజు సమర్పణలో సుధీర్‌చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. రీసెంట్‌గా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. బంజారా అమ్మాయిగా కీర్తి లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. తాజాగా విడుదలైన కీర్తి లుక్‌పై సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా కీర్తి లుక్‌కు ఫిదా అయ్యానని.. ఆ లుక్‌లో కీర్తి అదిరిపోయిందని.. విభిన్న కథలతో కీర్తి అదరగొడుతోందని తెలుపుతూ చిత్ర బృందానికి తన విషేష్‌ను తెలియజేశారు.

ఇక ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు నిర్మిస్తున్న ఉమెన్ సెంట్రిక్ చిత్రంలో కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న విష‌యం విదిత‌మే. కీర్తి 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. అయితే ఈ రోజు కీర్తి సురేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర టైటిల్ రివీల్ చేశారు. “పెంగ్విన్” అనే టైటిల్‌తో ఈ చిత్రం తెలుగు, త‌మిళంతో పాటు ప‌లు భాష‌ల‌లో విడుద‌ల కానుంది. పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్ గ‌ర్బ‌వ‌తిగా క‌నిపిస్తుంది. ప్రస్తుతం ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది.

Related posts