స్టార్ క్రీడాకారిణి, టాప్సీడ్ పి.వి.సింధు జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు 21-16, 21-7తో రియా ముఖర్జీని ఓడించింది. అంతకుముందు ప్రిక్వార్టర్స్లో సింధు 21-11, 21-13తో మాళవికపై విజయం సాధించింది. ఫైనల్లో స్థానం కోసం అస్మితతో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్లో టాప్ సీడ్ సమీర్వర్మ కాలి మడమ గాయంతో ప్రిక్వార్టర్స్ మ్యాచ్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడు. దీనితో 21-16, 1-8తో ఆర్యమన్ టాండన్ విజేతగా నిలిచాడు. కోర్టు ఉపరితలం సరిగా లేకపోవడంతో ఒకే మ్యాచ్ ఆడిన సైనాక్వార్టర్స్లో ప్రవేశించింది.
ప్రిక్వార్టర్స్లో సైనా 21-11, 21-10తో శ్రుతిపై గెలిచింది. క్వార్టర్స్లో ఆమె నేహా పండిట్తో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో సౌరభ్వర్మ, లక్ష్య సేన్ క్వార్టర్స్ చేరుకున్నారు. అంతకుముందు కోర్టు ఉపరితలం సరిగా లేకపోవడంతో సైనా మ్యాచ్తో సహా సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ మ్యాచ్లను కూడా వాయిదా వేశారు. కోర్టును పునరుద్ధరించిన తర్వాత మ్యాచ్లను కొనసాగించారు.