యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్,మందిరా బేడి, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, అరుణ్ విజయ్ ముఖ్యపాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో అభిమానులు తొలి రోజే ఈ సినిమాని వీక్షించేందుకు పోటీలు పడుతున్నారు. ఈ సినిమా ట్రైలర్కు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ లెవల్లో ఉన్నయాక్షన్ సీన్స్ సినీ ప్రముఖులను సైతం ఆశ్యర్యపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం రన్ టైమ్ 2 గంటల 54 నిమిషాలు ఉన్నట్టు సమాచారం.
next post