పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ‘వకీల్ సాబ్’ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక దీని తర్వాత వరుస సినిమాలకు పవన్ కళ్యాణ్ ఓకే చేశారు. అయితే వాటిలో ఏ సినిమాని మొదట సెట్స్ పైకి తీసుకెళ్తాడు అనే దానిపై క్లారిటీ లేదు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో మలయాళ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కతున్న ఈ సినిమా నిన్న అధికారికంగా లాంఛ్ అయింది. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం పవన్ కల్యాణ్ 40 రోజులు కేటాయించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఆసక్తికర టైటిల్స్ అన్ని ఫిలింనగర్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం. కాన్సెప్ట్ కు తగ్గట్లు ఈ సినిమాకి ‘బిల్లా రంగా’ టైటిల్ యాప్ట్ అవుతుందని భావించారు. ఇక బిల్లాగా పవర్స్టార్, రంగాగా రానా నటించనున్నారు.
previous post