telugu navyamedia
సినిమా వార్తలు

సైదాబాద్‌ నిందితుడు రాజు ఆత్మహత్యపై చిరంజీవి- మంచు మనోజ్‌ ట్వీట్‌

సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నక్కల్‌ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. కాగా, రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు.

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి రాజు ఆత్మ‌హ‌త్య‌పై ట్వీట్‌ చేస్తూ.. రాజు త‌న‌ను తాను శిక్షించుకోవ‌డం బాధిత బాలిక కుటుంబ స‌భ్యుల‌తో పాటు అంద‌రికీ ఊర‌ట క‌లిగిస్తోంద‌ని చెప్పారు. బాలిక‌ల‌పై దారుణ ఘ‌ట‌న‌లు మ‌రోసారి జ‌ర‌గ‌కూడ‌ద‌ని, అందుకు ప్ర‌జ‌లు చొర‌వ‌చూపాల‌ని ఆయ‌న కోరారు.


రాజు ఆత్మహత్య చేసుకున్న ఘటనను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించగా, ఆయన ట్వీట్‌ను మంచు మనోజ్‌ రీట్వీట్‌ చేస్తూ ‘సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్‌.. దేవుడు ఉన్నాడు’ అని పేర్కొన్నారు.

Related posts