ప్రేమించిన అమ్మాయి అడ్డు తొలగించుకునేందుకు ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. మాయమాటలతో నమ్మించి ఆమెను గ్రామ శివారులోని గుట్టపైకి తీసుకువెళ్లి హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కుప్పిన కుంట్ల గ్రామానికి చెందిన కావిటి తేజస్విని (20), సత్తుపల్లికి చెందిన నితిన్లు గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలో పాలిటెక్నిక్ చదివేవారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్య్వహారమ్ మొదలై ఇప్పటికీ కొనసాగుతోంది. పాలిటెక్నిక్ తర్వాత నితిన్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరగా, తేజస్విని కొన్ని సబ్టెక్టు తప్పడంతో ఇంట్లోనే ఉంటోంది.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తేజస్వినిని నితిన్ తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి సమీపంలోని గుట్టపైకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను చంపి పడేశాడు. కుమార్తె కనిపించక పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు తేజస్విని కాల్డేటాలో నితిన్ నంబర్ గుర్తించారు.అతను ఖమ్మం వసతి గృహంలో ఉంటున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీమ ప్రజలకు తాగునీరు ఇవ్వండి.. సీఎం జగన్ కు లోకేశ్ సూచన!