telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

టీడీపీ సమీక్షా ఫలితం : పాల్గొన్న అందరికి .. ఈసీ నోటీసులు ..

ap election officer altered

ఇటీవల ఏపీసీఎం చంద్రబాబు ఎన్నికల ఫలితాలపై తన సైన్యంతో సమీక్ష నిర్వహించారు. దీనిని తప్పుబట్టిన ఈసీ ఆ సమావేశంలో పాల్గొన్న అందరికి నోటీసులు జారీచేసింది. ఇప్పటికే వేడివేడిగా ఉన్న ఈసీ, టీడీపీ వర్గాలకు ఇది మరింత చేదు వార్తగా పరిణమించింది. ఏపీ సీఎం చంద్రబాబు తరచుగా అధికారులతో సమీక్షలు నిర్వహించడంపై తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఎస్ ను వివరణ కోరింది. ఈ నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు నోటీసులు పంపారు.

తాజాగా ఎన్నికలు పూర్తికావటం, ఇంకా ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, ముఖ్యమంత్రి చేపట్టే సమీక్షల్లో పాల్గొనడంపై సంజాయిషీ కోరారు. ముఖ్యంగా సీఆర్డీఏ, జల వనరుల శాఖ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం కోరినట్టు తెలుస్తోంది. అటు, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సీఎం సమీక్షలపై వైసీపీ నేతల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై నివేదిక ఇవ్వాలంటూ సీఎస్ ను ఆదేశించినట్టు సమాచారం.

Related posts