telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

టీడీపీకి షాక్‌ ఇచ్చిన మాగుంట..పవన్‌ కల్యాణ్‌తో భేటీ?

TDP Candidate withdraw Badwel
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న  తరుణంలో  ఏపీ రాజకీయాల్లో  వలసలు ఊపందుకొన్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నుంచి పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. ఓ వైపు తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు కొనసాగుతుంటే, మరోవైపు ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు పలువురు నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌తో పాటు తోట నరసింహం కూడా ఎన్నికల్లో పోటీ చేయమని తేల్చి చెప్పేశారు.
 తాజాగా మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగంట శ్రీనివాసులు రెడ్డి కూడా చంద్రబాబుకు షాక్‌ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయలేనని అధినేత వద్ద ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేయమని తనను బలవంతం పెట్టొద్దని చంద్రబాబుకు తెలిపారు. మరోవైపు మాగంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవల ఒంగోలు పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పవన్‌ను వ్యక్తిగతంగా మాత్రమే కలిశానని, తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని మాగుంట చెప్పడం విశేషం.

Related posts