“దిశ” హంతకుల ఎన్కౌంటర్ నేపథ్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం హైదరాబాద్ కు వచ్చింది. ఢిల్లీ నుంచి నలుగురు సభ్యుల బృందం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. కాసేపట్లో శంషాబాద్ నుంచి చటాన్పల్లి ప్రాంతానికి ఈ బృందం వెళ్లనుంది. చటాన్పల్లి ఎన్కౌంటర్ ప్రాంతాన్ని ఎన్హెచ్ఆర్సీ బృందం పరిశీలించనుంది.
ఎన్కౌంటర్ ఘ్తన పై తెలంగాణ పోలీసులకు శుక్రవారం ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీచేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్చార్సీ దిశ నిందితుల ఎన్కౌంటర్పై పూర్తి వివరాలు ఆందజేయాలని పోలీసులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసిన విషయం విధితమే.
అమరావతి పై లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు