తల్లి పాలనాసామర్థ్యం అమోఘమని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కితాబిచ్చారు. ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ కుటుంబం అనే చిన్నరాజ్యం అమ్మ ఏలుబడిలో, సంరక్షణలో సురక్షితంగా ఉంటుందని తెలిపారు. ‘మా నాన్న ప్రజాసేవలో తీరిక లేకుండా ఉంటే, మా అమ్మ అటు ఇంటి బాధ్యతలను, ఇటు వ్యాపార నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించింది’ అని ప్రశంసించారు.
నాన్న ప్రజాసేవలో తీరికలేకుండా ఉంటే ఇటు ఇంటి బాధ్యతలను, అటు వ్యాపార నిర్వహణను మా అమ్మే సమర్థవంతంగా నిర్వర్తించింది. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికీ లోకేశ్ శుభకాంక్షాలు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మలందరికీ పాదాభివందనాలు అని లోకేశ్ ట్వీట్ చేశారు.
వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు…