telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వీడియో వైరల్ : డ్రైవింగ్‌ సీట్లో తండ్రి…. పక్క సీట్లో కూతురికి పాడే

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కరోనా వల్ల అనేక మంది మృతి చెందుతున్నారు. శ్మశానల వద్ద శవాల గుట్టలు మనుషుల్లో మానవత్వాన్ని కూడా ఇది మంటగలుపుతుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా జల్వార్‌ గ్రామానికి చెందిన సీమకు కరోనా సోకింది. ఆమెను కోటాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నెలరోజుల పాటు కరోనాతో పోరాడినా.. సీమ చివరకు మృతి చెందింది. అయితే ఆమె మృత దేహాన్ని స్వగ్రామం జల్వార్‌ గ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవరు 35,000 డిమాండ్ చేశాడు. దీంతో అంత ఇచ్చుకోలేమని సీమ తండ్రి మృతదేహాన్ని ప్యాక్ చేసి ముందు సీటును పడేలా కిందకు వంచి సీటు బెల్ట్ తో కదలకుండా కన్నీరు పెట్టుకుంటూ, కారు నడుపుతూ మృత దేహాన్ని ఇంటికి చేర్చాడు. అయితే మార్గమధ్యంలో కొందరు ఈ ఫోటోలను తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన జైపూర్ కలెక్టర్ కు తెలిసింది. దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.  

Related posts