ఏపీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ ఖండించారు. చంద్రబాబుపై అనవసర విమర్శలు చేస్తున్నారని.. పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తిపై వ్యక్తిగత దూషణలు సరికాదని చైతన్యకృష్ణ మండిపడ్డారు. ఈ మేరకు చైతన్యకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు.
కొడాలి నాని, వంశీ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం మా మావయ్య చంద్రబాబు. ఆయనను నోటికొచ్చినట్లు దూషిస్తే సహించేదిలేదు. విధి విధానాల పరంగా ఏమైనా అభ్యంతరాలుంటే విమర్శించుకోండి.. అంతేకానీ వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చైతనకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.