తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు అదపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కన్నాయిగూడెం మండలం ఏటూర్ వద్ద కాజ్వే పై జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు.ఇదిలా ఉంటే కొమరం భీం జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతంలో కూడా ఓ ఆర్టీసి బస్సుకు ప్రమాదం తృటిలో తప్పింది. తుఫాన్ ప్రభావం వల్ల రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు తిర్యాణి అటవీ ప్రాంతంలో బస్సు అదుపు తప్పి రోడ్డు దిగింది. ఆ సమయంలో బస్సులో 46మంది ప్రయాణికులున్నారు. అయితే ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
previous post
next post
సమ్మె మొదలైన వారంలోనే కార్మికులపై కుట్రలు: మందకృష్ణ