ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో ఎంపీ సుజనాచౌదరి భేటీ అయ్యారు. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన తర్వాత మొదటిసారిగా పార్లమెంట్లోని బీజేపీ కార్యాలయానికి సుజనాచౌదరి వచ్చారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై కన్నాతో సుజనాచౌదరి చర్చించినట్లు సమాచారం. టీడీపీ నుంచి సుజనాచౌదరి బీజేపీలోకి చేరిన తర్వాత వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నలుగురు సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ అందజేశారు. అనంతరం రాజ్యసభ అధికార వెబ్ సైట్ లో వారు టీడీపీ నుంచి వైదొలిగినట్టు ప్రకటించారు.