telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఉదయం టీడీపీ నుంచి వైసీపీలో చేరి.. సాయంత్రానికి మళ్ళీ టీడీపీలోకి!

voilance jummalamadugu ycp tdp
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో రసవత్తర సన్నివేశాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామంలో ఉదయం వైసీపీలో చేరిన కొందరు టీడీపీ కార్యకర్తలు, సాయంత్రానికల్లా తిరిగి సొంత పార్టీలోకి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలు ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న తమను ఆదుకుంటామని ప్రతిపక్ష పార్టీ నాయకుల మాటలు నమ్మి ఉదయం టీడీపీని వదలి వైసీపీలో చేరామని పార్టీలో చేరిన తరువాత ఆ పార్టీ నాయకులు చెప్పిన మాటలు అబద్దమని తెలిసి తిరిగి సాయంత్రానికి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరినట్టు ప్రకటించారు.  
గ్రామానికి చెందిన కొందరు స్థానిక నాయకుల మాటలు విని నియోజకవర్గ ఇన్‌చార్జి నంబూరి శంకరరావు సమక్షంలో క్రోసూరు పార్టీ కార్యాలయంలో వైసీపీలో చేరారు. కండువాలు వేసిన తరువాత తమను ఆదుకుంటామని చెప్పి భోజనం పెట్టి పంపించారని కోపంతో మరలా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ వద్దకు వచ్చి తాము తప్పు చేశామని తాము టీడీపీ కట్టుబడి ఉంటామని మళ్లీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.చెప్పుడు మాటలు విని టీడీపీనీ వీడవద్దని రానున్న ఎన్నికలలో మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కొమ్మాలపాటి హామీ ఇచ్చారు. 

Related posts