telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అయోధ్య కేసు : మధ్యవర్తిత్వం మేలు.. ముగ్గురితో కమిటీ.. !

supreme court two children petition

అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కార మార్గం కనుగొనడం సులభమవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో అన్ని వర్గాలూ ఓ నిర్ణయానికి వచ్చి, సమస్య సమసిపోవాలంటే, మధ్యవర్తుల నియామకమే మేలైనదని భావిస్తున్నామని ఈ ఉదయం వ్యాఖ్యానించిన అత్యున్నత ధర్మాసనం, ముగ్గురితో కూడిన కమిటీని నియమించింది. ఈ ప్యానల్ లో జస్టిస్ ఖలీపుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరాం పంచ్ లు భాగమవుతారని వెల్లడించింది.

మరో నాలుగు వారాల్లో అందరు పిటిషనర్లు, వాద ప్రతివాదులతో చర్చలు జరిపి తమ నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఫైజాబాద్ కేంద్రంగా ఈ ప్రక్రియను మొత్తాన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కొద్దిసేపటి క్రితం సూచించింది. కాగా, అయోధ్యలోని వివాదాస్పన 2.7 ఎకరాల భూమి తమదంటే తమదని హిందూ, ముస్లిం సంఘాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే.

Related posts