సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో తొలిదశ పోలింగ్ ముగిసేవరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా సెన్సారింగ్ ను వాయిదా వేస్తామని బోర్డు చెప్పడంపై వర్మ మండిపడ్డారు. సెన్సార్ బోర్డుకు కేవలం సర్టిఫికెట్ జారీచేసే అధికారం మాత్రమే ఉందనీ, సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేసే అధికారం లేదని స్పష్టం చేశారు.
ఈ పరిణామాలపై చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్టుగా వెల్లడించారు. సెన్సార్ బోర్డ్ తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరిస్తూ సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. సెన్సార్ బోర్డుపై కేసు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. సెన్సార్ బోర్డు తన సినిమాను చట్టవిరుద్ధంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని వర్మ ట్విట్టర్ లో దుయ్యబట్టారు.
ఇండియాతో మ్యాచ్ ఆడితేనే అది తెలుస్తుంది : పాక్ క్రికెటర్