ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పై ధ్వజమెత్తారు. విద్యాభివృద్ధిపై ఏపీ సర్కార్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. 2014-15 నుంచి విద్యానికేతన్ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదంటూ మోహన్ బాబు ఆరోపించారు. ఇదే విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంటింటికీ తిరిగి.. అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారు? అంటూ మోహన్ బాబు ప్రశ్నించారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిన కాదని, ఏ పార్టీ ప్రోత్సాహంతో తాను మాట్లాడటం లేదని ఆయన స్పష్టం చేశారు.
next post
వైసీపీ నేతలు బిల్డర్లపై “జే-ట్యాక్స్”.. నారా లోకేష్ విమర్శలు