మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ హైదరాబాదులోని ఫిలిం ఛాంబర్ లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు పోలింగ్ కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసోసియేషన్ అధ్యక్ష పదవికి శివాజీరాజా, నరేష్ లు పోటీ చేయగా ‘మా’ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేష్ గెలుపొందారు. తన ప్రత్యర్థి శివాజీ రాజాపై 69 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మొత్తం నమోదైన ఓట్లలో 268 ఓట్లు నరేష్కు పోలవగా.. శివాజీ రాజాకు 199 ఓట్లు పడ్డాయి. 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్ కనకాల, జాయింట్ సెక్రటరీగా గౌతమ్రాజు, శివబాలాజీ గెలుపొందారు.హేమ ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అలీ, రవిప్రకాశ్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వి, జాకీ, సురేశ్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటి కల్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ విజయం సాధించారు.