ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్, వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని కామెంట్లు చేసినా… నిమ్మగడ్డ తగ్గడం లేదు. అయితే…తాజాగా నిమ్మగడ్డ రమేష్కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. నిమ్మగడ్డ రాజ్యాంగ శక్తి కాదు.. రాజకీయ వ్యాపారి అని.. చంద్రబాబు ఎజెండా ప్రకారం నిమ్మగడ్డ రమేష్ రాష్ట్ర పర్యటన నిర్వహిస్తున్నారని ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత కోరికలు, కక్షలు తీర్చుకోవడానికి నిమ్మగడ్డ జిల్లాల పర్యటన చేస్తున్నారని ఆయన మాటలను బట్టి అర్థం అవుతుందని పేర్కొన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న తీరు చూసి ప్రజలు ఛీ కొడుతున్నారని… నిమ్మగడ్డ ఎస్ఈసీ గా కాదు పచ్చి రాజకీయ వాదిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిమ్మగడ్డ ఎర్రగడ్డకు వెళ్ళాలో, ఇంకో చోటికి వెళ్ళాలో నిర్ణయించుకోవాలని హితువు పలికారు. వైఎస్సార్ విగ్రహాలకు ముసుగులు కప్పుతున్న నిమ్మగడ్డ…. వైఎస్సార్ ను పొగడుతున్నాడు…తనకు నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు. మీడియా గట్టిగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందన్న నిమ్మగడ్డ… మరి జర్నలిస్ట్ లకు ప్రశ్నలను అడిగే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు? అని నిలదీశారు.
previous post
నన్నో క్రిమినల్ లా చూశారు… గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కెనడియన్ ఫిలింమేకర్ ఫైర్