telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీహార్ లో  దాణా స్కాం కంటే.. ఏపీలో  నీరు-చెట్టు కుంభకోణం పెద్దది!

vijayasaireddy as member of aims in AP

బీహార్ లో దాణా స్కాం కంటే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన నీరు-చెట్టు కుంభకోణం పెద్దదని వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి ఆరోపించారు. ట్విట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబు, లోకేష్‌పై తీవ్ర‌స్థాయిలో విమర్శలు గుప్పించారు. 22 వేల కోట్ల నిధులను జన్మభూమి కమిటీలకు పంచి పెట్టారని ఆరోపించారు. 

సమగ్ర దర్యాప్తు జరిగితే బాబు, చిన బాబు ఇంకా అనేక పెద్ద తలకాయల బండారం బయట పడుతుంది. చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన ఉండదని మరోసారి రుజువైంది. కాపులు, బలహీనవర్గాలను ఆయన ఎప్పుడూ విశ్వసించరని అర్థమైంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవిని చాలా మంది ఆశించినా చివరకు పయ్యావుల కేశవ్‌ను ఎంపిక చేసి బంధుప్రీతిని చాటుకున్నారు. అని ట్విట‌ర్‌లో పేర్కొన్నారు. 

Related posts