ఏపీ రాజధాని అమరావతిని మార్చొద్దంటూ కొనసాగుతున్న ఆందోళనలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతిలో ఉన్నదీ, ఇతర ప్రాంతాల్లో లేనిది ఏమిటో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం కూడా చంద్రబాబు వల్లే వచ్చిందని అన్నారు.
ఇప్పుడు రాష్ట్రం మూడు ముక్కలు కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని చెప్పారు. అలా జరిగితే ఆయనకు సంతోషంగా ఉంటుందా? అని ప్రశ్నించారు. అమరావతి విషయంలో ఆందోళనలు ఇలాగే కొనసాగితే ఉత్తరాంధ్రలోనూ ఉద్యమం మొదలుపెడతామని మంత్రి అవంతి హెచ్చరించారు. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించకపోతే విప్లవం వస్తుందని మంత్రి అన్నారు.
బోస్టన్ గ్రూప్ కమిటీపై ఎఫ్బీఐ కేసులు: టీడీపీ నేత అనురాధ