బోస్టన్ గ్రూప్ కమిటీపై ఎఫ్బీఐ కేసులు ఉన్నాయని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తెలిపారు. ప్రభుత్వ తప్పులను విమర్శిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై అసభ్యంగా పోస్టులు పెడితే కఠిన చర్యలుంటాయన్న సీఎం జగన్.. తమ ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడుతుంటే ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు.
రాజధాని రైతులు, ఉత్తరాంధ్రపై ప్రభుత్వానికి ఎందుకు కక్షకట్టారని అనురాధ నిలదీశారు. కేబినెట్లో రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా.. న్యాయనిపుణుల కమిటీతో సంప్రదింపులంటూ కథలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏడు నెలల పాలనలో ప్రభుత్వాన్ని 27 సార్లు కోర్టు చీవాట్లు పెట్టిందన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్పొరేట్గా పోటీ చేసి దారుణంగా ఓడిన విషయం అందరికీ తెలుసని గుర్తు చేశారు.